News March 20, 2024
వందేభారత్ టైమింగ్స్ మార్చాలని విజ్ఞప్తి
సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెల్లవారుజామున స్టేషన్కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ అందుబాటులో ఉంటుందంటున్నారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైన్ పూర్తికాకపోవడంతో ఈ రైలు టైమింగ్స్ మార్చలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News October 1, 2024
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఎంతంటే?
TG: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్గా ఈ ఏడాది ₹93,750 చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం 42,000 మంది కార్మికులకు ఈ బోనస్ వర్తించనుంది. గత ఏడాది ₹85,500 చెల్లించగా, ఈసారి అదనంగా ₹8,250 ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది సంస్థ సాధించిన లాభాల్లో 33% కార్మికులకు చెల్లించాలని సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన డబ్బులు ఈనెల 7న కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.
News October 1, 2024
వాట్సాప్లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ ఫీచర్
వాట్సాప్లో ‘రిమైండర్ నోటిఫికేషన్’ అనే ఫీచర్ రానుంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్స్ సెట్టింగ్స్లో ‘రిమైండర్స్’ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే యూజర్లకు అన్సీన్ స్టేటస్ల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. దీని వల్ల రెగ్యులర్గా స్టేటస్లు చూడని వారు, కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండే వారు ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఫేవరెట్/ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్స్ స్టేటస్లపైనే ఇది ఫోకస్ చేస్తుందని సమాచారం.
News October 1, 2024
గ్రాండ్గా ‘దేవర’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్?
Jr.NTR నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా డిసైడ్ కాలేదని సినీవర్గాలు తెలిపాయి. ఫ్యాన్స్ భారీగా రావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సక్సెస్ ఈవెంట్ను ఓపెన్ గ్రౌండ్లో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.