News March 18, 2024
ఎన్నికల షెడ్యూల్ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి

సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ ప్రకటించిన షెడ్యూల్పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ తేదీలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన శుక్రవారం వస్తున్నాయని, ఆ రోజుల్లో పోలింగ్ వద్దని కోరింది. మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంటుందని.. అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.
Similar News
News January 19, 2026
మహిళలపై నిందలు, డ్రెస్సింగ్పై రూల్స్ కరెక్ట్ కాదు: రేణుకా చౌదరి

TG: మంత్రులు, మహిళా అధికారులపై నిందలు మోపడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేత, MP రేణుకా చౌదరి అన్నారు. మహిళలను కించపరుస్తూ కొందరు SMలో పోస్టులు పెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. మహిళల డ్రెస్సింగ్ వివాదంపైనా ఆమె స్పందించారు. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలో మీరెలా డిసైడ్ చేస్తారు. ఇలాంటి రూల్స్ మీ ఇంట్లో వాళ్లకి పెట్టుకోండి’ అని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు.
News January 19, 2026
కాంగ్రెస్, BRS, TDP సోషల్ మీడియా వార్.. ఫొటోలు వైరల్

TG: BRS దిమ్మెలను కూల్చివేయాలన్న CM రేవంత్ వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. తెలంగాణ గడ్డపై గాంధీ భవన్, ఎన్టీఆర్ భవన్ లేకుండా చేస్తామంటూ BRS నేతలు పోస్టులు చేస్తున్నారు. వాటిని కూల్చివేసినట్లు AI జనరేటెడ్ ఫొటోలు క్రియేట్ చేశారు. అటు కాంగ్రెస్, TDP నేతలు సైతం BRS పార్టీని, తెలంగాణ భవన్ను నేలమట్టం చేస్తామంటూ AI ఫొటోలు పెడుతున్నారు.
News January 19, 2026
పశువుల్లో క్షయ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.


