News October 28, 2024
40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తాడు!

కాంచీపురం(TN)లోని అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆలయంలో స్వామి విగ్రహాలు రెండు ఉండగా అందులో ఒకటి మాత్రమే నిత్యం పూజలందుకుంటుంది. కర్రతో చేసిన 9 అడుగుల చెక్క విగ్రహం 40 ఏళ్లకు ఒకసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అప్పటివరకు ఆ విగ్రహాన్ని ఆలయ పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరుస్తారు. చివరగా 2019లో విగ్రహాన్ని బయటకు తీశారు.
Similar News
News January 7, 2026
రప్ఫాడిస్తున్న రింకూ

విజయ్ హజారే ట్రోఫీలో యూపీ కెప్టెన్గా రింకూ సింగ్ అదరగొడుతున్నారు. వరుసగా 6 విజయాలతో గ్రూప్-Bలో 24 పాయింట్లతో టీమ్ను అగ్రస్థానంలో నిలిపారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా 67(48), 106*(60), 63(67), 37*(15), 41(35), 57(30) పరుగులు చేశారు. ప్రతి మ్యాచ్లోనూ తన మార్క్ బ్యాటింగ్, కెప్టెన్సీతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. రాబోయే T20WCలోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
News January 7, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్?

APలో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో FEB రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై ఓ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.
News January 7, 2026
‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


