News October 28, 2024
40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తాడు!

కాంచీపురం(TN)లోని అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆలయంలో స్వామి విగ్రహాలు రెండు ఉండగా అందులో ఒకటి మాత్రమే నిత్యం పూజలందుకుంటుంది. కర్రతో చేసిన 9 అడుగుల చెక్క విగ్రహం 40 ఏళ్లకు ఒకసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అప్పటివరకు ఆ విగ్రహాన్ని ఆలయ పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరుస్తారు. చివరగా 2019లో విగ్రహాన్ని బయటకు తీశారు.
Similar News
News January 2, 2026
ఈ ప్రాణులు భాగస్వామితో కలవగానే చనిపోతాయి

ప్రపంచంలో 11 ప్రాణులు తమ భాగస్వామితో కలిశాక చనిపోతాయని BBC వైల్డ్ లైఫ్ పేర్కొంది. అవి.. గ్రీన్ అనకొండ, మగ తేనెటీగలు, అమెజాన్ కప్ప, ఎలుకను పోలిన యాంటిచినుస్ మార్సుపియాల్స్, వాస్ప్ స్పైడర్స్, ఆక్టోపస్, గొల్లభామను పోలిన ప్రేయింగ్ మాంటిస్, పసిఫిక్ సాల్మన్, రెడ్బ్యాక్ స్పైడర్స్, లాబర్డ్ ఊసరవెల్లి. కలిసిన సమయంలో అధిక హార్మోన్ల విడుదల, శక్తి కోల్పోవడం, భాగస్వామి తినేయడం వంటి కారణాలతో ఇవి చనిపోతాయి.
News January 2, 2026
పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CBN

AP: 22 లక్షల పాసుపుస్తకాల పంపిణీతో ప్రతి ఇంట్లో సంతోషం నెలకొందని CM CBN పేర్కొన్నారు. ‘గత పాలకులు తమ ఫొటోలతో పాసుపుస్తకాలు పంపిణీ చేసి ₹22Cr తగలేశారు. రీసర్వేతో వివాదాలు పెంచారు. మేం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో మేలు చేశాం. లక్ష్యం నెరవేరేలా మంత్రులు చొరవ చూపాలి’ అని టెలికాన్ఫరెన్సులో CM సూచించారు. ఇవాళ ఆరంభమైన పాసుపుస్తకాల పంపిణీ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమంలో ఒకరోజు CM పాల్గొంటారు.
News January 2, 2026
‘గ్రోక్’ అశ్లీల కంటెంట్పై కేంద్రం సీరియస్

Xలో ‘గ్రోక్’ అశ్లీల ట్రెండింగ్పై కేంద్రం సీరియస్ అయింది. అలాంటి కంటెంట్ను వెంటనే తొలగించాలంటూ సదరు సంస్థను ఆదేశించింది. ఇటీవల గ్రోక్ సాయంతో మహిళల ఫొటోలను బికినీలోకి మారుస్తున్న ట్రెండ్పై సర్వత్రా <<18744158>>ఆందోళన<<>> వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం అసభ్యకర, నగ్న, లైంగిక చర్యలను ప్రోత్సహించే కంటెంట్ను తొలగించాలని Xకు లేఖ రాసింది. AIని ఇలా దుర్వినియోగపర్చడం సరికాదని సూచించింది.


