News October 28, 2024

40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తాడు!

image

కాంచీపురం(TN)లోని అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆలయంలో స్వామి విగ్రహాలు రెండు ఉండగా అందులో ఒకటి మాత్రమే నిత్యం పూజలందుకుంటుంది. కర్రతో చేసిన 9 అడుగుల చెక్క విగ్రహం 40 ఏళ్లకు ఒకసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అప్పటివరకు ఆ విగ్రహాన్ని ఆలయ పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరుస్తారు. చివరగా 2019లో విగ్రహాన్ని బయటకు తీశారు.

Similar News

News October 28, 2024

మరో ఐదుగురు జర్నలిస్టులు మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలు సంస్థలకు చెందిన మ‌రో ఐదుగురు జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు త‌మ‌ను భ‌య‌పెట్ట‌లేవ‌ని, ఇజ్రాయెల్ నిరంకుశ‌త్వాన్ని వెలికితీయ‌కుండా జ‌ర్న‌లిస్టుల‌ను నిలువ‌రించ‌లేవ‌ని గాజాలోని ప్ర‌భుత్వ‌ మీడియా ఆఫీస్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఇప్ప‌టిదాకా 176 మంది జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

News October 28, 2024

యంగ్ ప్లేయర్లకు IPLపైనే ఎక్కువ ఇంట్రస్ట్: MSK

image

భారత క్రికెట్ భవిష్యత్తుపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లలో చాలా మంది దేశానికి ఆడేకంటే IPL ఆడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘IPLతో ప్లేయర్ల మైండ్‌సెట్ మారింది. అన్ని ఫార్మాట్లలో దూకుడుగా ఆడేస్తున్నారు. స్పిన్, స్వింగ్‌ను ఆడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు సచిన్, గంగూలీ వంటి వారు ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడేవారు’ అని పేర్కొన్నారు.

News October 28, 2024

సూపర్ న్యూస్.. కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాజమౌళితో మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాకపోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన చిత్రంలో క్లైమాక్స్‌లో కృష్ణుడిగా కనిపిస్తారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం గమనార్హం. కాగా మహేశ్ పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.