News January 31, 2025

వాల్యూలో యాపిల్.. యునిట్స్‌లో వివో టాప్!

image

ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో 2024లో ఏయే కంపెనీలు ఎంత శాతం షేర్‌ను కలిగి ఉన్నాయో ‘Counterpoint’ నివేదించింది. వాల్యూలో ఐఫోన్ 23%, శామ్‌సంగ్ 22%, వివో 16%, ఒప్పో 16%, షావోమీ 9%, మిగిలిన కంపెనీలు 14 శాతం షేర్‌ను కలిగి ఉన్నాయి. అయితే, అత్యధిక మొబైల్స్ దిగుమతి చేసిన కంపెనీగా ‘వివో’ (19%) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో షావోమీ 17%, శామ్‌సంగ్ 16%, ఒప్పో 15% ఉన్నాయి.

Similar News

News November 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 20, 2025

బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.

News November 20, 2025

కోచింగ్ సెంటర్‌లో ప్రేమ.. విడాకులు!

image

iBOMMA నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమీర్‌పేట్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ముస్లిం యువతిని రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది. విదేశాల్లో ఉన్న తన అక్క, బావ రూ.కోట్లు సంపాదిస్తుంటే, నీకు డబ్బు సంపాదించడం చేతకావట్లేదని రవి భార్య, అత్త ఎగతాళి చేసేవారని దర్యాప్తులో తేలింది. 2021లో విడాకులు కాగా పాపను భార్య తీసుకెళ్లినట్లు తేలింది.