News March 24, 2025

ఏఐ ఫీచర్లతో యాపిల్ వాచ్ కెమెరాలు!

image

కెమెరాలతో కూడిన సరికొత్త వాచ్‌లను యాపిల్ తీసుకురానుంది. AI సాంకేతికతతో ఇవి పనిచేయనున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. కెమెరాల ద్వారా పరిసరాల గురించి సమాచారం అందించడంలో ఇవి ఉపయోగపడుతాయని పేర్కొన్నాయి. స్టాండర్డ్ మోడల్స్‌లో ముందు వైపు, అల్ట్రా మోడల్స్‌లో పక్కకు కెమెరాలు ఉంటాయని పేర్కొన్నాయి. అయితే ఇవి ఫేస్ టైమ్ కాల్స్ కోసం కాకుండా AI ఫీచర్స్ ను ఉపయోగించుకునేలా ఉంటాయని వెల్లడించాయి.

Similar News

News March 26, 2025

భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

image

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్‌ డేటాబేస్‌ (ఆధార్‌)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.

News March 26, 2025

నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

image

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్‌లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్‌ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.

News March 26, 2025

లంచ్‌లో వీటిని తీసుకుంటున్నారా?

image

కొందరు మధ్యాహ్న భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. కానీ ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కువగా సలాడ్లు తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్, పెరుగు తినాలి. ఇవి జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పండ్లు తింటే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. లంచ్‌లో గుడ్లు, చేపలు తినడం ఉత్తమం.

error: Content is protected !!