News February 5, 2025

ప్రవేశ పరీక్షలకు ఎస్సీ ఉపకులాలవారీగా దరఖాస్తుల స్వీకరణ

image

TG: SC వర్గీకరణకు అసెంబ్లీ, మండలి నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఎస్సీల దరఖాస్తుల్ని ఉపకులాల వారీగా స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఉపకులాలతో సంబంధం లేకుండా SC విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. కాగా.. ఈ నెల 25 నుంచి EAPCET దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ఆలోపు వర్గీకరణపై ఆదేశాలు వెలువడితే దరఖాస్తుల్ని ఉపకులాలవారీగా స్వీకరించే అవకాశం ఉంది.

Similar News

News December 5, 2025

పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

News December 5, 2025

రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలం: నారాయణ

image

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్‌కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.

News December 5, 2025

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్‌ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.