News February 5, 2025

ప్రవేశ పరీక్షలకు ఎస్సీ ఉపకులాలవారీగా దరఖాస్తుల స్వీకరణ

image

TG: SC వర్గీకరణకు అసెంబ్లీ, మండలి నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఎస్సీల దరఖాస్తుల్ని ఉపకులాల వారీగా స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఉపకులాలతో సంబంధం లేకుండా SC విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. కాగా.. ఈ నెల 25 నుంచి EAPCET దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ఆలోపు వర్గీకరణపై ఆదేశాలు వెలువడితే దరఖాస్తుల్ని ఉపకులాలవారీగా స్వీకరించే అవకాశం ఉంది.

Similar News

News November 14, 2025

Leading: ఎన్డీయే డబుల్ సెంచరీ

image

బిహార్‌లో అద్వితీయ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 200 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంజీబీ కేవలం 37 స్థానాల్లోపే లీడ్‌లో ఉంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ 91 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. జేడీయూ 81, ఆర్జేడీ 28 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

News November 14, 2025

సంచలనం.. రికార్డు సృష్టించిన నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంచలనం సృష్టించారు. మెజారిటీలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణు రికార్డును బ్రేక్ చేశారు. ఇదివరకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రికార్డు 2009లో విష్ణు(కాంగ్రెస్) పేరిట ఉంది. ఆయన 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజా ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశారు.

News November 14, 2025

ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

image

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.