News March 22, 2025

నేటి నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

AP: రాష్ట్రంలో KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏప్రిల్ 11వరకు <>ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు<<>> స్వీకరిస్తున్నారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు.

Similar News

News December 9, 2025

నేడు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

TG: ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 10గంటలకు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పలు కారణాలతో 6 జిల్లాల్లో(ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్) ఈ కార్యక్రమం జరగదు. కాగా ఈ ఒక్కో విగ్రహానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.5.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

News December 9, 2025

ఈ రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.

News December 9, 2025

నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

image

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.