News January 30, 2025
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/
Similar News
News December 13, 2025
‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

TG: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో 3 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్లకు HYD పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ‘డ్రగ్స్ దొరికితే యాజమాన్యానిదే బాధ్యత. పార్కింగ్ సహా అంతటా CCTVలు ఉండాలి. బయట రా.10 గం.కు సౌండ్ సిస్టమ్ ఆపాలి. లోపల 45 డెసిబుల్స్తో ఒంటిగంట వరకే అనుమతి. డ్రంకెన్ డ్రైవ్కు రూ.10 వేలు ఫైన్, 6నెలల జైలు/లైసెన్స్ రద్దు. తాగిన వారికి డ్రైవర్లు/క్యాబ్లు నిర్వాహకులే ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.
News December 13, 2025
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు.. తెలంగాణకు సున్నా

PMAY-G కింద FY25-26 నిధులలో TGకి నయాపైసా కూడా కేటాయించలేదు. ఈ పథకం కింద 4 ఏళ్లలో మొత్తం ₹1,12,647.16CR విడుదల చేస్తే TGకి, WBకి పైసా రాలేదు. APకి ₹427.6CR వచ్చాయి. BJP పాలిత రాష్ట్రాలు, బిహార్ వంటి కొన్ని NDA అధికారంలో ఉన్న స్టేట్స్కే అత్యధిక వాటా దక్కింది. అలాగే ఎన్నికలు జరగనున్న TN, కేరళ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులయ్యాయి. MH కాంగ్రెస్ MP వేసిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది.
News December 13, 2025
మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్

HYDలో మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మధ్యాహ్నం కోల్కతాలో అభిమానులు <<18551215>>స్టేడియంలో<<>> రచ్చ చేయడంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ ఈవెంట్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మెస్సీ HYDలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసేవరకు ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంది. మెస్సీని తనివితీరా చూసిన అభిమానులూ హ్యాపీగా ఫీలయ్యారు.


