News January 30, 2025

రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

image

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

Similar News

News December 23, 2025

క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

image

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్స‌వ’ శుభాకాంక్షలు.

News December 23, 2025

Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

News December 23, 2025

‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

image

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.