News January 30, 2025
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/
Similar News
News January 2, 2026
BSNL వార్షిక ప్లాన్.. రూ.2,799తో డైలీ 3GB

యూజర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్ను స్టార్ట్ చేసింది. రూ.2,799తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ లభించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ టెలికం సంస్థలతో పోల్చితే ఇదే తక్కువ కావడం విశేషం. గతంలో ఈ ప్లాన్ ధర రూ.2,399 (డైలీ 2GB)గా ఉండేది. 5Gతో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ అందించాలని యూజర్లు కోరుతున్నారు.
News January 2, 2026
ఇంట్లోని ఈ వస్తువులు యమ డేంజర్!

మనం శుభ్రంగా ఉంటాయని భావించే వస్తువులే బ్యాక్టీరియాకు అసలైన నిలయాలు. పబ్లిక్ టాయ్లెట్ సీటు కంటే సూపర్ మార్కెట్ <<18742127>>ట్రాలీలు<<>>, ATM & లిఫ్ట్ బటన్లపై 40 రెట్లు ఎక్కువ క్రిములుంటాయని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్స్, ఆఫీస్ కీబోర్డులు, వంటగదిలోని స్పాంజ్లు, రిమోట్లు ఇన్ఫెక్షన్లకు కారకాలు. వందల మంది తాకే ఈ వస్తువుల ద్వారా 80% వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని వాడాక చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్.
News January 2, 2026
PCOSతో మహిళల్లో మానసిక సమస్యలు

ప్రస్తుతకాలంలో పీసీఓఎస్తో బాధపడే మహిళల సంఖ్య పెరిగింది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పలు మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో త్వరగా మతిమరపు రావడం, డిప్రెషన్తో పాటు టైప్–2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.


