News January 30, 2025
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/
Similar News
News December 20, 2025
యాక్టివేటెడ్ చార్కోల్తో ఎన్నో లాభాలు

యాక్టివేటెడ్ చార్కోల్ టాక్సిన్స్ను బయటకు పంపి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. * యాక్టివేటెడ్ చార్కోల్ ఉన్న ఫేస్మాస్క్, ఫేస్వాష్ సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తాయి. మీరు వేసుకునే ఏ ప్యాక్స్లో అయినా యాక్టివేటెడ్ చార్కోల్ మిక్స్ చేసుకోవచ్చు. * దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సున్నితమైన చర్మం, రోసేసియా ఉన్నవారికి చాలా అనువైంది.
News December 20, 2025
భార్యను బాధపెడుతున్నారా! శ్రీనివాసుడికే తప్పలేదు..

భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన్నినప్పుడు, ఆ అవమానం భరించలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడింది. దీంతో శ్రీహరి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది అనేందుకు ఈ వృత్తాంతమే నిదర్శనం. భార్య మనసు నొప్పించకుండా, గౌరవించే ఇంట్లోనే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. స్త్రీ గౌరవమే కుటుంబ సౌభాగ్యానికి మూలం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News December 20, 2025
రైతుల అకౌంట్లలో ‘బోనస్’ డబ్బులు జమ

TG: రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. వీటికిగానూ రూ.13,833 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మీకు సన్న వడ్ల ‘బోనస్’ పడిందా?


