News January 30, 2025
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/
Similar News
News December 12, 2025
IMF షరతులతో పాక్ ఉక్కిరిబిక్కిరి

పాకిస్థాన్కు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 7 బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దశలవారీగా కండిషన్స్ కూడా పెడుతోంది. తాజాగా మరో 11 షరతులు పెట్టడంతో మొత్తం నిబంధనల సంఖ్య 64కు చేరింది. వీటిని 18 నెలల్లో అమలు చేయాలి. వీటిలో మొదటిది కరప్షన్ కట్టడికై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆస్తుల వివరాలు ఈ ఏడాది చివరినాటికి ప్రకటించేలా డెడ్ లైన్ విధించింది.
News December 12, 2025
సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్తో మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్తో లిస్ట్ అయ్యి ఉన్నారు.
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.


