News January 30, 2025

రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2 దరఖాస్తులు

image

AP: JEE మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలకు రేపటి నుంచి FEB 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APR 1 నుంచి 8 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది. కాగా జనవరి సెషన్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అన్ని విభాగాల్లో ప్రశ్నలన్నీ సులభంగానే ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. రెస్పాన్స్ షీట్, కీలను FEB 1 లేదా 2వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.
వెబ్‌సైట్: https://jeemain.nta.nic.in/

Similar News

News December 15, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్

News December 15, 2025

BC రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు: మహేశ్ గౌడ్

image

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా కేంద్రం తొక్కిపెడుతోందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ‘దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆగలేదు. పోరాటానికి అన్ని పార్టీలు కలసిరావాలి. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాలని CM రేవంత్ రాహుల్ గాంధీని కోరారు. BJP ఎన్నిరోజులు ఆపాలనుకున్నా అది సాధ్యం కాదు. బిల్లు సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

News December 15, 2025

మాంసాహారం తిని గుడికి వెళ్లవచ్చా?

image

మాంసం తిని గుడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. అందులో ఉండే తమో, రజో గుణాలు మనలో నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయని, తద్వారా పూజా ఫలితం దక్కదని అంటున్నారు. అందుకే గుడికి వెళ్లేటప్పుడు, దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం గుడ్లు కూడా ముట్టుకోవద్దంటున్నారు. అయితే సంపూర్ణ పూజా ఫలం దక్కాలంటే.. ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు లేని ఆహారాన్నే స్వీకరించాలని సూచిస్తున్నారు.