News March 16, 2025
పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
Similar News
News March 28, 2026
తొక్కిసలాట మృతులకు నివాళి.. మెమోరియల్ ఏర్పాటు

IPL: RCB గెలుపు వేడుకల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు నివాళులర్పిస్తూ చిన్నస్వామి స్టేడియం వద్ద KSCA మెమోరియల్ ఏర్పాటు చేసింది. గత జూన్ 4న జరిగిన ఘటనలో 11 మంది చనిపోగా వారిని గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్లో ప్లేయర్లు సైతం 11 నంబర్ జెర్సీలు ధరించారు. ఇక RCB ప్లేయర్లు ఇవాళ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి ఆడనున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో ఇకపై 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
News March 28, 2026
ఎయిర్పోర్టు వల్ల ₹15Cr పరిహారం.. హెలికాప్టర్ కొన్న రైతు!

నోయిడాలో <<19499063>>విమానాశ్రయ<<>> నిర్మాణంతో కొందరు రైతుల జీవితాలు మారిపోయాయి. భూ సేకరణలో భాగంగా ₹15Cr పరిహారం పొందిన ఓ రైతు ఓ హెలికాఫ్టర్ను కొని థాయిలాండ్కు ట్రిప్ ప్లాన్ చేశాడు. మరో వ్యక్తి అక్కడి ప్రాజెక్టులకు లేబర్ను సప్లయ్ చేసే కాంట్రాక్టర్గా మారాడు. అజయ్ అనే వ్యక్తి హెల్మెట్లు, తాళాలు భద్రపరిచే సెంటర్తో నెలకు ₹60,000 సంపాదిస్తున్నాడు. కొందరు గదులు నిర్మించి వలస కార్మికులకు అద్దెకిస్తున్నారు.
News March 28, 2026
DMK ఫస్ట్ లిస్ట్.. OPSకు సీటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CM స్టాలిన్ DMK తొలి జాబితాను విడుదల చేసిన <<19500787>>విషయం<<>> తెలిసిందే. మాజీ CM, AIADMK నుంచి ఇటీవల ఆ పార్టీలో చేరిన O పన్నీర్ సెల్వమ్కు బోడినాయక్కనూర్ సీటు కేటాయించారు. ఆయన అనుచరులు స్టాలిన్-కొలతూర్, ఉదయనిధి-చెపాక్ నుంచి బరిలోకి దిగనున్నారు. స్టాలిన్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ఇటీవల OPS వ్యాఖ్యానించారు. <<-se>>#ELECTIONS2026<<>>


