News August 22, 2025

ఈ-పాస్‌పోర్ట్‌ కోసం ఇలా అప్లై చేసుకోండి!

image

కేంద్రం దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తోంది. దీని కోసం epassport <>సైట్‌లో<<>> అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకుని, తర్వాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ట్రెడిషనల్ పాస్‌పోర్ట్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. కానీ రీప్లేస్‌మెంట్ కాదు. దీని ఎంబెడెడ్ చిప్‌లో బయోమెట్రిక్ వివరాలుంటాయి. ఇది పాస్ పోర్టుకు భద్రతనివ్వడంతో పాటు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్‌ను ఈజీ చేస్తుంది.

Similar News

News August 22, 2025

రూ.300 కోట్ల దిశగా ‘మహావతార్ నరసింహ’

image

హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 5వ వారంలోనూ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.278 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ గత నెల 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది.

News August 22, 2025

సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారు.. షా తీవ్ర ఆరోపణలు

image

‘INDI’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన ‘సల్వాజుడుం’కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోయుంటే 2020కి ముందే నక్సలిజం అంతమయ్యేదని కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించిందని విమర్శించారు.

News August 22, 2025

త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు

image

AP: తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమకానున్నాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఇకపై ఏటా DSC నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.