News January 16, 2025

APPLY.. 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

AP: గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ <>వైబ్‌సైట్‌లో<<>> తెలిపింది. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700. మిగతావారికి రూ.500. ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. https://apcob.org/careers/

Similar News

News December 11, 2025

విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

image

TG: ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన గద్వాల(D) ధరూర్‌లో జరిగింది. ఓ ఇంట్లో 2 రోజుల క్రితం ఫ్రిజ్ పేలగా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు చనిపోయారు. కాగా ఫ్రిజ్‌‌‌ను గోడకు 15-20cm దూరంలో ఉంచడం, క్లీన్ చేయడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

News December 11, 2025

BELలో అప్రెంటిస్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల ఆహ్వానం

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BEL<<>>) ఘజియాబాద్ 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, BE అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి DEC 25వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు స్టైపెండ్ రూ.17,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bel-india.in

News December 11, 2025

పెరుగన్నం నైవేద్యంతో ప్రయోజనాలు

image

కులదైవాలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే అప్పులు తీరిపోతాయని నమ్మకం. దీనికి దానిమ్మ గింజలు కలిపి సమర్పిస్తే శత్రు బాధలు తొలగి, తేజస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘ఇందులో ఎండు ఖర్జూరం కలిపి దానం చేస్తే డబ్బుకు సమస్య ఉండదు. మిరపకాయ, ఉప్పు కలిపి నైవేద్యంగా పెడితే గొడవలు, రోగాలు, అప్పులు దూరమవుతాయి. విష్ణు సహస్రనామం పఠించి దంపతులకు ఈ పెరుగన్నం దానం చేస్తే రోగ బాధలు తొలగిపోతాయి’ అని అంటున్నారు.