News October 8, 2024
APPLY NOW: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

రైల్వేలో 14,298 గ్రేడ్-1, గ్రేడ్-3 టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ఐటీఐ, అప్రెంటిస్షిప్ పూర్తిచేసుకుని, జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
వెబ్సైట్: rrbapply.gov.in
Similar News
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్కు యువ నాయకుడు మోత రోహిత్కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్
News November 22, 2025
వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.


