News October 11, 2024

APPLY NOW.. 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

image

TG: 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 16, 17 తేదీల్లో సవరణలు చేసుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో అత్యధికంగా 1576 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.36,750-రూ.1,06,990 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 5, 2025

ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే..?

image

ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరిసంపదలకు లోటుండదని నమ్మకం. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 5, 2025

కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సెల్ఫ్ స్లాట్‌కు అవకాశం

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), HC (మినిస్టీరియల్), HC(Asst. వైర్‌లెస్ ఆపరేటర్) పోస్టుల పరీక్షకు సంబంధించి సెల్ఫ్ స్లాట్‌కు అవకాశం ఇచ్చింది. కానిస్టేబుల్ (D) పోస్టులకు DEC 5 -10వరకు, కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌)కు DEC 5-30 వరకు, HC(మినిస్టీరియల్)కు DEC 5-JAN 5వరకు, HC(Asst. వైర్‌లెస్ ఆపరేటర్) DEC 5-JAN 5వరకు సెల్ఫ్ స్లాట్ సెలక్షన్ చేసుకోవచ్చు.

News December 5, 2025

ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి?

image

2 పెద్ద ప్రమిదలు, ఒక చిన్న ప్రమిద తీసుకొని వాటికి పసుపు, కుంకుమ పెట్టాలి. బియ్యప్పిండి ముగ్గుపై పెద్ద ప్రమిదలను ఒకదానిపై మరొకటి పెట్టి అందులో రాళ్ల ఉప్పు పోసి పసుపు, కుంకుమ చల్లాలి. దానిపై చిన్న ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో రెండు వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఆ సమయంలో దీపం శ్లోకం చదువుకోవాలి. నైవేద్యం పెట్టి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం చదివినా శుభ ఫలితాలుంటాయి.