News January 18, 2025
APPLY NOW: ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)లో 212 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 142 సూపరింటెండెంట్(డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్(ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్కు రూ.35,400-రూ1,12,400, JAకు రూ.19,900-రూ.63,200 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News February 4, 2026
‘వారణాసి’ సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ!

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.
News February 4, 2026
ఒక్క రోజే రూ.20వేలు పెరిగిన కేజీ సిల్వర్

నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ.20,000 పెరిగి రూ.3,20,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. అటు బంగారం ధరలు కూడా ఇవాళ <<19045966>>భారీగా పెరిగిన<<>> విషయం తెలిసిందే.
News February 4, 2026
హిస్టరీ క్రియేట్ చేయనున్న దీదీ!

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు. రాష్ట్ర ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘంతో జరుగుతున్న పోరులో భాగంగా సుప్రీంకోర్టులో తన వాదనలను ఆమె స్వయంగా వినిపించనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మమత, CM హోదాలో ఉండి సర్వోన్నత న్యాయస్థానంలో స్వయంగా వాదించబోతున్న తొలి CMగా నిలవనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షిండమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


