News July 19, 2024
APPLY: బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్

AP, TGలోని బీడీ కార్మికులు, మైనింగ్ వర్కర్ల పిల్లలు కేంద్ర కార్మిక శాఖ నేషనల్ స్కాలర్షిప్స్ కోసం scholarships.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 1-10 విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, 11వ తరగతి నుంచి డిగ్రీ వరకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్స్ వస్తాయి. ప్రీమెట్రిక్ కోసం AUG 31, పోస్ట్ మెట్రిక్ కోసం OCT 31లోపు అప్లై చేసుకోవాలి. హెల్ప్ లైన్ నం. 0120-6619540, 040-29561297.
Similar News
News February 1, 2026
స్థానిక సంస్థలకు గ్రాంటుగా 1.40 లక్షల కోట్లు

దేశంలోని రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ₹1.40 లక్షల కోట్లను గ్రాంటుగా అందించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. అలాగే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. వివిధ పన్నుల నుంచి రాష్ట్రాల వాటాగా 41 శాతం నిధులను అందించనున్నట్లు ప్రకటించింది.
News February 1, 2026
బ్యాంకింగ్ రంగ పటిష్ఠానికి ఉన్నతస్థాయి కమిటీ

బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేలా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు హెల్తీ బ్యాలెన్స్ షీట్లు, లాభాలతో మెరుగ్గా ఉన్నాయి. మొండి రుణాలపై నియంత్రణతో ఉన్నాయి. మరింత మెరుగైన రీతిలో వీటిని పటిష్ఠం చేసేందుకు, సంస్కరణల అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తుంది. తదుపరి ఎకనమిక్ గ్రోత్ సాధనకు ఇది దోహదపడుతుంది’ అని వివరించారు.
News February 1, 2026
సాఫ్ట్వేర్ రంగానికి ఊరట: ట్యాక్స్ రూల్స్లో బిగ్ అప్డేట్!

IT, సాఫ్ట్వేర్ రంగంలో పన్నుల గందరగోళానికి చెక్ పెడుతూ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. IT, ITeS, KPO, కాంట్రాక్ట్ R&D సేవలను విడివిడిగా కాకుండా వాటన్నింటినీ కలిపి IT సర్వీసెస్ అనే ఒకే కేటగిరీగా గుర్తిస్తారు. వీటన్నింటికీ ఒకే ‘Safe Harbour Framework’ వర్తించడం వల్ల ట్యాక్స్ రూల్స్ సింపుల్గా మారతాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది.


