News January 5, 2025
వారంలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు

TG: రాష్ట్రంలో త్వరలో జూనియర్ లెక్చరర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్ల కిందటే 1392 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్కు అప్పగించింది. మల్టీజోన్-1లో 581 మంది, జోన్-2లో 558 మంది ఉన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా వీరికి వారంలోగా నియామక పత్రాలు ఇచ్చి కాలేజీల్లో భర్తీ చేయనున్నారు.
Similar News
News December 28, 2025
పని గంటలు కాదు.. శ్రద్ధ ముఖ్యం: ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే ఎంత శ్రద్ధగా పనిచేశామనేది ముఖ్యమని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎస్డీ శిబులాల్ అన్నారు. ‘పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్కు టైమ్ కేటాయించేందుకు ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఉంటుంది. కేటాయించిన టైమ్లో 100% ఫోకస్డ్గా ఉండాలి. సమయపాలనలో ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్లు వారికి ఉంటాయి’ అని చెప్పారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
News December 28, 2025
పసిపిల్లలకు ఫుడ్ అలవాటు చేసేముందు

ఘనాహారం అలవాటు చేసే ముందు పిల్లలకు పెట్టే ఏ ఆహారమైనా వారి శరీరానికి సరిపడుతుందో, లేదో ఒక్కసారి పరిశీలించాలంటున్నారు నిపుణులు. ముందుగా కొద్ది మొత్తాల్లో వారికి పెట్టి చూడాలి. దీంతో అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వారికి పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత నిపుణుల సలహా తీసుకొని వారిచ్చిన న్యూట్రిషన్ ఛార్ట్ ఫాలో అయితే మీ చిన్నారికి చక్కటి పోషకాహారం అందుతుందంటున్నారు.
News December 28, 2025
పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?

ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి దిష్టి తీస్తారు. ఉప్పును ఎడమ చేత్తో తీసుకుని బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దీంతో ఉప్పు బిడ్డలోని ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. అలాగే బిడ్డపై ఉన్న చెడు ప్రభావం పోతుందని అంటారు. అనంతరం ఆ ఉప్పును ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఈ ప్రక్రియ బిడ్డకు దృష్టిని మళ్లించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మార్గమని మరికొందరు అంటారు.


