News March 28, 2024

ఏపీకి ఎన్నికల పరిశీలకుల నియామకం

image

ఏపీ ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురిని నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌గా రామ్‌మోహన్ మిశ్రా, పోలీసు వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌ నియమితులయ్యారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న వీరు.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

Similar News

News January 10, 2026

సంక్రాంతి సెలవులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

సంక్రాంతి అనగానే అంతా సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్యాష్, నగలు ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయండి. మీ ట్రావెల్‌కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మీ ఇంటి దగ్గర పరిస్థితిపై మీకేమైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయండి.

News January 10, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.

News January 10, 2026

సినిమా టికెట్లేనా.. స్కూల్ ఫీజులు, ఆస్పత్రుల దోపిడీ సంగతేంటి?

image

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల పెంపు, కోర్టుల్లో కేసులు, వివాదాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే భారీగా ఉన్న స్కూల్ ఫీజులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులు, రవాణా ఛార్జీలు తగ్గించాలని ఎవరూ ఎందుకు అడగట్లేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీటి వల్ల ఎక్కువ మందిపై భారం పడుతోందని, సినిమా టికెట్ల కంటే వీటిపై చర్చ ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ COMMENT?