News September 22, 2024

ఆరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాల నియామకం

image

TG: రాష్ట్రంలో మరో ఆరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను ప్రభుత్వం నియమించింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కమ్మర్‌పల్లి, వేల్పూరు, కరీంనగర్ జిల్లాలో గోపాల్‌రావు పేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బోయిన్‌పల్లి, కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70 మార్కెట్లకు పాలకవర్గాల నియామకం జరిగిందన్నారు.

Similar News

News December 13, 2025

కోదాడకు గుడ్‌న్యూస్.. ఎలివేటెడ్ రైల్వే లైన్‌కి కేంద్రం ఆమోదం

image

హైదరాబాద్‌-చెన్నై హై-స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఎలివేటెడ్ రైలు కారిడార్ అమరావతి, కోదాడ, సూర్యాపేట గుండా వెళ్లనుంది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల కోదాడకు వేగవంతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని, తద్వారా స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News December 13, 2025

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

image

<<18552173>>కోల్‌కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.

News December 13, 2025

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగకి నెలకొనే రద్దీ దృష్ట్యా జనవరి 8వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా APలోని ఇతర ప్రాంతాలు, పక్క రాష్ట్రాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. స్పెషల్ ట్రైన్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.