News January 19, 2025

వైసీపీలో నియామకాలు.. చోడవరానికి అమర్నాథ్, భీమిలికి శ్రీను

image

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది.

Similar News

News November 27, 2025

టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. CTET నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ctet.nic.inలో నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 18, 2025. పరీక్ష ఫిబ్రవరి 8, 2026న జరుగుతుంది. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో 20 భాషల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో, రాష్ట్రస్థాయిలో టీచర్ ఉద్యోగాలు సాధించడానికి CTET అవకాశం కల్పిస్తుంది.

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?