News July 12, 2024
ఏపీపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో సవాంగ్ డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించింది. 2022 మార్చిలో బాధ్యతలు చేపట్టగా.. వచ్చే ఏడాది జులై 9వరకు సవాంగ్ పదవీ కాలం ఉన్నా ముందుగానే రాజీనామా చేశారు.
Similar News
News October 27, 2025
‘సర్’లో ఏం చేస్తారు?

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై EC నేడు ప్రకటన చేయనుంది. తొలి విడతగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న TN, బెంగాల్, కేరళ, అస్సాం, పాండిచ్చేరిలో నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. జాబితా ప్రకారం ఓటర్లు ఆ ఇంట్లో ఉన్నారా? లేరా? అని చెక్ చేస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, తప్పుల సవరణకు ఇది దోహదపడుతుందని EC చెబుతోంది.
News October 27, 2025
గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్

ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ రెడ్డి అనే మినియేచర్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే అతిచిన్న చెక్క స్పూన్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ స్పూన్ పొడవు 1.13mm. సూది కన్నులోంచి వెళ్లగలిగేంత చిన్నగా ఉంటుంది. దీనిని రూపొందించేందుకు 3 నెలల సమయం పట్టిందని, మైక్రోస్కోప్తో చూస్తేనే ఇది కనిపిస్తుందని బిజయ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు బిహార్కు చెందిన వ్యక్తి(1.64mm) పేరిట ఉండేది.
News October 27, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.


