News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.

Similar News

News September 15, 2025

కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

image

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.

News September 15, 2025

కలెక్టర్ల సదస్సుకు పవన్ దూరం.. కారణమిదే?

image

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటంతో రాలేదని ఆయన PR0 తెలిపారు. ఈ రోజునే ప్రారంభమైన పితృకర్మ పూజలో పవన్ పాల్గొంటున్నారని చెప్పారు. దీంతో రేపు కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.

News September 15, 2025

మరో వివాదంలో పూజా ఖేడ్కర్

image

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.