News April 13, 2025

ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

image

1919: పంజాబ్ జలియన్ వాలాబాగ్‌‌లో జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల్లో 379 మంది ఉద్యమకారులు మృతి
1999: నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం
1999: ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
* జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం

Similar News

News January 26, 2026

Republic day Special: స్వాతంత్య్రోద్యమంలో నారీ శక్తి

image

భారత స్వాతంత్య్ర సమరంలో ఎందరో వీరవనితలు పాలుపంచుకున్నారు. 1857కు ముందే రాణి అబ్బక్క చౌతా, రాణి వేలు నాచియార్‌, కిట్టూరు చెన్నమ్మ సమరశంఖం పూరించగా, సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్‌ మహల్‌, 1885లో కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, మేడం కామా, అనీబిసెంట్‌, ముత్తు లక్ష్మిరెడ్డి, లక్ష్మీ సెహగల్‌, సుచేత కృపాలాని, మాతంగిని హజ్రా, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణా అసఫ్‌ అలీ కీలకపాత్ర పోషించారు.

News January 26, 2026

రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం చంద్రబాబు

image

AP: అమరావతిలోని రాయపూడిలో జరుగుతున్న రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. పతాకావిష్కరణ తర్వాత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కాగా తొలిసారిగా అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతులు, విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

News January 26, 2026

ఇండోర్‌‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

image

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పుర‌లో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.