News April 25, 2025
ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం
Similar News
News April 25, 2025
143 మంది యాక్టర్లతో వాట్సాప్ గ్రూప్.. కానీ: నాని

బన్నీ, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి సహా 143 మంది తెలుగు యాక్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉందని హీరో నాని తెలిపారు. అయితే అది ప్రస్తుతం యాక్టివ్గా లేదని, తాను కూడా ఆ గ్రూప్ను మ్యూట్లో ఉంచుతానని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించుకోవడానికి దాన్ని క్రియేట్ చేశామన్నారు. అప్పట్లో బాగా చాట్ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానుంది.
News April 25, 2025
డెత్ ఓవర్లలో RR బోల్తా.. ఏం జరుగుతోంది?

ఈ సీజన్లో RR ఛేజింగ్ డెత్ ఓవర్లలో విఫలమవుతోంది. వరుసగా 3 గెలవాల్సిన మ్యాచ్లలో ఓడిపోయింది. APR 16న(vsDC) చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సి ఉండగా టై చేసుకుని సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. APR 19న(vsLSG) 6 బంతుల్లో 9 రన్స్ చేయాల్సి ఉండగా 2 రన్స్ తేడాతో ఓడింది. నిన్న RCBతో మ్యాచ్లో 12 బంతుల్లో 18 రన్స్ చేయలేక 11 పరుగుల తేడాతో మట్టికరిచింది. దీంతో ఏం జరుగుతోందంటూ RR ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News April 25, 2025
ఉగ్రదాడిని మిలిటెంట్ల దాడిగా పేర్కొన్న NYT.. US ఆగ్రహం

జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని న్యూయార్క్ టైమ్స్(NYT) పత్రిక మిలిటెంట్ల దాడిగా పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం మండిపడింది. ఇండియా/ఇజ్రాయెల్ లేదా మరేచోటైనా టెర్రరిజం విషయానికి వచ్చేసరికి NYT వాస్తవాల నుంచి దూరం జరుగుతుందని ఫైరయ్యింది. ఈ మేరకు US ఫారిన్ అఫైర్స్ కమిటీ Xలో పోస్టు చేసింది. ఆ పత్రిక క్లిప్పింగ్లో మిలిటెంట్లుగా పేర్కొన్న భాగాన్ని కొట్టేసి టెర్రరిస్టులుగా మార్పు చేసింది.