News April 7, 2025
ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

1920: సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1942: బాలీవుడ్ నటుడు జితేంద్ర జననం
1962: సినీదర్శకుడు రామ్గోపాల్ వర్మ జననం
1962: నటి కోవై సరళ జననం
1991: కవి కొండవీటి వెంకటకవి మరణం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
Similar News
News April 9, 2025
సూక్ష్మ సేద్యంలో AP నంబర్-1

AP: FY25లో 1.17L హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్-1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.16L హెక్టార్లు), UP(1.02L హె,), కర్ణాటక(97K హె,) TN(91K హె,) ఉన్నాయి. బిందు, తుంపర్ల పరికరాల కోసం కేంద్రం, AP ప్రభుత్వాలు, రైతులు కలిసి ₹1,176Cr వెచ్చించారు. దేశంలో ఈ పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఉన్నాయి.
News April 9, 2025
మా బంధం సీక్రెట్ అదే: ఉపాసన

వ్యాపారాల్లో ఉన్నట్లుగానే వివాహ బంధంలోనూ భార్యాభర్తలు సమీక్ష చేసుకోవాలని మెగా కోడలు ఉపాసన ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఇద్దరికీ మధ్య సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. బంధంలో ఎత్తుపల్లాలన్నవి సహజం. ఆ సమయంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నారన్నది ముఖ్యం. మేం వారానికి ఒకరోజైనా ఒకరికొకరు పూర్తి సమయాన్ని కేటాయించుకుంటాం. సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకుంటాం. అదే మా సీక్రెట్’ అని తెలిపారు.
News April 9, 2025
కొనసాగుతున్న అల్పపీడనం

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దీంతో ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 11న ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.