News April 8, 2025
ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

1857: స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే మరణం
1894: వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ మరణం
1977: రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం
1982: సినీనటుడు అల్లు అర్జున్ జననం
1983: నటి అనురాధ మెహతా జననం
1984: పాటల రచయిత అనంత శ్రీరామ్ జననం
1988: నటి నిత్యా మేనన్ జననం
1994: నటుడు అక్కినేని అఖిల్ జననం
Similar News
News April 8, 2025
SDC మృతి తీరని లోటు: కలెక్టర్

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.రమ మృతి అత్యంత బాధాకరమని, రెవిన్యూ శాఖకు తీరని లోటని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. జేసీ రాజేంద్రన్, DRO మధుసూదన్ రావు, RDO శ్రీనివాస్తో కలసి SDC రమ భౌతిక కాయనికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. SDC రమ అంకితభావంతో పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు.
News April 8, 2025
రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.
News April 8, 2025
తెలుగు రాష్ట్రాల్లో ‘అధిక బరువు’ సమస్య

ఏపీ, టీజీ రాష్ట్రాల్లో 82% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించి రిపోర్టును వెల్లడించింది. 81% మందిలో విటమిన్-D లోపం ఉందని, ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్-1 ఫ్యాట్ లివర్ సంకేతాలు ఉన్నాయని తెలిపింది. 77శాతం మహిళల్లో పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో 28% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొంది.