News January 23, 2025
గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం

ఢిల్లీ కర్తవ్యపథ్లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి AP, KAలకు అవకాశం దక్కగా, TGకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.
Similar News
News October 22, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.3,380 తగ్గి ₹1,27,200కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.3,100 పతనమై ₹1,16,600గా ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్(31.10g) ధర $245 తగ్గడమే ఇందుకు కారణం అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,80,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 22, 2025
టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
News October 22, 2025
ఏడడుగులు ఎందుకంటే?

మొదటి అడుగు – శారీరక బలం కోసం
రెండో అడుగు – మానసిక బలం కోసం
మూడో అడుగు – ధర్మాచరణ కోసం
నాల్గో అడుగు – కర్మ సంబంధమైన సుఖం కోసం
ఐదో అడుగు – పశు సమృద్ధి కోసం
ఆరో అడుగు – రుతువులలో తగిన ఆరోగ్యం కోసం
ఏడో అడుగు – సంసార జీవితాన్ని ‘ఒక యజ్ఞంగా’ భావించమని చెప్పే ‘స్నేహం’ కోసం
<<-se>>#Pendli<<>>