News June 2, 2024

హైదరాబాద్‌తో తెగిపోయిన ఏపీ బంధం 2/2

image

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ మరో పదేళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.

Similar News

News October 31, 2025

AP న్యూస్ రౌండప్

image

➤ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి రూ.150కోట్లు విడుదల చేసిన కేంద్రం
➤ SC, ST అట్రాసిటీ బాధితులకు రాయితీపై రుణాలు: మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్
➤ NOV 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్.. అక్కడ జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్-2025లో పాల్గొననున్న మంత్రి
➤ రాష్ట్ర వ్యాప్తంగా 1,592 స్కూళ్లలో బాలికలకు కరాటేలో శిక్షణ.. 2025-26 అకడమిక్ ఇయర్‌లో 2 నెలల పాటు 20 తరగతుల నిర్వహణ

News October 31, 2025

మూల విరాట్టుకు ఆ శక్తి ఎక్కడిదంటే?

image

ఆలయాల్లో మూల విరాట్టు కింద రాగి రేకుపై యంత్రాలు, బీజాక్షరాలను ప్రతిష్ఠిస్తారు. రాగి మంచి విద్యుత్ వాహకం కావడంతో.. ఆ రేకుపై ఉన్న గీతలు, బీజాక్షరాల మధ్య శక్తి కేంద్రీకృతమవుతుంది. మంత్రాలతో కలిపి ప్రతిష్ఠించడం వల్ల చుట్టూ ఉన్న శక్తి కూడా ఆ కేంద్రంలోకి ఆకర్షితమవుతుంది. ఇలా ఏర్పడిన శక్తి క్షేత్రంలోకి మనం ప్రవేశించినప్పుడు, మన శరీరం దాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మానసిక బలం, ధైర్యం లభిస్తాయి.

News October 31, 2025

7,565 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

SSCలో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల 18-25ఏళ్ల వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, SC, ST, మాజీ సైనికులకు ఫీజు లేదు. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు.