News February 16, 2025

ఏపీ ఇష్టారాజ్యం-కాంగ్రెస్ చోద్యం: KTR

image

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.

Similar News

News November 11, 2025

ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదంటే?

image

త్రివిధ తాపాల్లో దైవిక తాపం ఒకటి. ఇది ప్రకృతి శక్తుల వలన సంభవిస్తుంది. అధిక వర్షాలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుఫానులు, గ్రహాచారాల వలన కలిగే బాధలు దీని కిందకి వస్తాయి. ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి దైవారాధన, భక్తి, ప్రకృతి పట్ల మనం గౌరవం చూపాలి. యజ్ఞాలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు వంటి ధార్మిక కర్మలను ఆచరించాలి. విధిని అంగీకరించాలి. తద్వారా ఈ దైవిక దుఃఖాలను తట్టుకునే మానసిక శక్తి లభిస్తుంది.

News November 11, 2025

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS, లాస్కర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indiancoastguard.gov.in/

News November 11, 2025

పత్తి కాండం, ఆకు, కాయపై నల్ల మచ్చల నివారణ ఎలా?

image

వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పత్తి మొక్క కాండంపైన, ఆకు, కాయలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. అలాగే కాయ కుళ్లిపోవడం లేదా ఎదగకపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యను గుర్తిస్తే లీటరు నీటికి 2.5గ్రా కార్బండజిమ్+ మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ. లేదా క్రెసోక్సిమ్ మిథైల్ 1ml లాంటి మందులను మారుస్తూ 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.