News April 8, 2025
APSRTC 750 ఎలక్ట్రిక్ బస్సులు

APకి కేంద్రం శుభవార్త అందించింది. ‘PM ఈ-బస్ సేవా’ కింద తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడ, GNT, VSKP, కాకినాడ, రాజమండ్రి, NLR, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాల్లో వీటిని తిప్పనుంది. PPP పద్ధతిలో 10వేల బస్సులను రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుండగా, ఏపీకి 750 కేటాయించింది. త్వరలోనే ఏ డిపోకు ఎన్ని కేటాయించాలనే దానిపై వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.
Similar News
News January 16, 2026
162 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

NABARD 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి జనవరి 17నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.32,000 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. వెబ్సైట్: https://www.nabard.org
News January 16, 2026
బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.
News January 16, 2026
వంటింటి చిట్కాలు

* కప్పు వెనిగర్ లో టేబుల్ స్పూను ఉప్పు కలిపి వేడిచేయాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే రాగి పాత్రలకు పట్టించి చల్లారాక శుభ్రపరిస్తే సరి. కొత్తవాటిలా మెరుస్తాయి. * నిల్వ ఉంచిన మష్రూమ్స్ తాజాగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించేందుకు వాటిని వెల్లుల్లితో కలిపి ఉడికించండి. రంగు మారితే అవి పాడయినట్లు అర్థం. * డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే దరిచేరవు.


