News July 15, 2024
APSRTC బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

TG: మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
Similar News
News February 10, 2026
జైలుకి వెళ్లడానికైనా సిద్ధమే: అస్సాం సీఎం

హైదరాబాద్లో తనపై అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్ చొరబాట్లపై తాను చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే’ అని పేర్కొన్నారు. కాగా మతపరంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 10, 2026
ఢిల్లీ చేరిన సీఎం.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

AP: సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయనకు టీడీపీ ఎంపీలు ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారితో కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే ఉన్న దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం 1 జన్పథ్లోని తన నివాసానికి వెళ్లారు.
News February 10, 2026
కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.


