News July 15, 2024
APSRTC బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

TG: మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
Similar News
News January 7, 2026
రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

ఉక్రెయిన్తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.
News January 7, 2026
జనవరి 07: చరిత్రలో ఈరోజు

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం
News January 7, 2026
బాటిల్ మూత రంగుతో నీటిని గుర్తించవచ్చు!

మార్కెట్లో దొరికే వాటర్ బాటిల్ మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చు. నీలం రంగు మూత ఉంటే అది సహజ సిద్ధమైన మినరల్ వాటర్. తెలుపు రంగు ప్రాసెస్ చేసిన నీటిని, ఆకుపచ్చ రంగు ఫ్లేవర్డ్ నీటిని సూచిస్తాయి. బ్లాక్ కలర్ ఆల్కలైన్ వాటర్కు, రెడ్ ఎనర్జీ డ్రింక్స్కు సంకేతం. అయితే ఇది అన్ని కంపెనీలకు తప్పనిసరి నిబంధన కాదు. కొనేముందు లేబుల్ చెక్ చేయడం మంచిది.


