News March 11, 2025
అరకు కాఫీకి ప్రత్యేక స్థానం: రామ్మోహన్ నాయుడు

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అరకు కాఫీ ప్రాముఖ్యత తెలిసేలా పార్లమెంట్ వద్ద ప్రచార కార్యక్రమం ఏర్పాటుకు అనుమతించాలని ఆయన స్పీకర్ ఓంబిర్లాను కోరారు. అరకు కాఫీని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. అరకు వ్యాలీ ఈ పంటకు ప్రసిద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 25, 2025
RR: మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే!

RR GP పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్లో షాద్నగర్లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, శంషాబాద్ గ్రామాల్లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్లో శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్లో అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


