News March 23, 2025

పార్లమెంట్‌లో రేపు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

image

AP: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రేపటి నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాళ్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

HNK: నందనం గణేష్‌కు కర్మవీర్ చక్ర అవార్డులో బ్రాంజ్ మెడల్

image

హనుమకొండ జిల్లా ఐనవోలు నందనం గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త యాకర గణేష్ ప్రతిష్ఠాత్మక కర్మవీర్ చక్ర అవార్డ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను అందుకున్నారు. నవంబర్ 26న ఫరీదాబాద్‌లో యూ.ఎన్‌ భాగస్వామ్యంతో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. సాంకేతిక ఆవిష్కరణలు, పౌర చైతన్యం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నందుకు గణేష్‌ను సన్మానించారు.

News November 28, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: నారాయణ

image

AP: అమరావతిలో రైల్వేస్టేష‌న్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోస‌మే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెంద‌దని.. అందుకే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ క‌ట్టాల‌ని సీఎం నిర్ణ‌యించార‌న్నారు. గ‌తంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎక‌రాలు ఇచ్చామని వివరించారు.

News November 28, 2025

డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

image

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.