News June 7, 2024
‘నోటా’ ఓట్లలో దేశంలోనే అరకు రెండో ప్లేస్

AP: మంగళవారం వెలువడిన ఫలితాల్లో అరకు లోక్సభ స్థానానికి ఏకంగా 50,470 ‘నోటా’ ఓట్లు పడ్డట్లు తేలింది. ఇవి అక్కడ పోలైన ఓట్లలో 4.33శాతం కాగా నోటాకు అత్యధికంగా వచ్చిన ఓట్లలో దేశంలోనే అరకు రెండో స్థానంలో నిలిచింది. 2,18,674 ఓట్లతో మధ్యప్రదేశ్లోని ఇండోర్ తొలి స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో అత్యల్పంగా విశాఖ లోక్సభ స్థానానికి 5,313 నోటా ఓట్లు పడ్డాయి.
Similar News
News September 9, 2025
జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు

జనగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. అనేక రకాల వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో పనిచేస్తుందని, ప్రజలు తప్పనిసరిగా ఫిజియోథెరపిస్టుల సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎం & హెచ్ఓ మల్లికార్జున్ రావు పాల్గొన్నారు.
News September 9, 2025
డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

యూఎస్ ఓపెన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్కు ట్రంప్తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.