News February 27, 2025
గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా?

గుడ్లు అంటే చాలామందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాలపాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా పాన్ లేదా వంటపాత్రలో పగలగొట్టకూడదు. గుడ్డు పెంకుపై ఉండే బ్యాక్టీరియా వీటిలోకి చేరుతుంది. వేరే పాత్రలో ఫిల్టర్ చేశాకే ఉపయోగించాలి.
Similar News
News February 8, 2026
భారత్తో ఘర్షణ వేళ చైనా ‘అణు’ కుట్ర? US సంచలన రిపోర్ట్!

2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత సైనికులతో ఘర్షణ జరిగిన సరిగ్గా వారం తర్వాత చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని US సంచలన ఆరోపణలు చేసింది. ప్రపంచం కొవిడ్తో పోరాడుతున్న వేళ చైనా Decoupling టెక్నిక్ వాడి భూకంప సంకేతాలు బయటకు రాకుండా ఈ పరీక్షను దాచిపెట్టిందని UN వేదికగా అమెరికా వెల్లడించింది. Lop Nur ప్రాంతంలో వందల టన్నుల సామర్థ్యంతో ఈ పేలుడు జరిగినట్లు US ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
News February 8, 2026
రాత్రిపూట ఈ ఒక్క అలవాటు మార్చుకోండి.. మీ గుండె సేఫ్!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు నిద్రపోయామనే దానికంటే ఏ టైమ్కి పడుకున్నామన్నదే చాలా ముఖ్యమని పరిశోధనలో తేలింది. ‘స్లీప్ అడ్వాన్సెస్’ జర్నల్లో వచ్చిన స్టడీ ప్రకారం.. రోజూ ఒకే టైమ్కు నిద్రపోయే అలవాటు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 15రోజులు రెగ్యులర్గా ఒకే టైమ్కి పడుకుంటే BP తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ చిన్న మార్పుతో హైపర్ టెన్షన్ సమస్యకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు.
News February 8, 2026
అమెరికాపై భారత్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్లో భారత్ బోణీ కొట్టింది. USAతో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా ఛేదనలో తడబడింది. బౌలింగ్లో మెప్పించినా బ్యాటింగ్లో తేలిపోయింది. శుభం(37), సంజయ్ కృష్ణమూర్తి(37), మిలింద్(34) మినహా ఎవరూ రాణించలేకపోయారు. IND బౌలర్లలో సిరాజ్ 3, అక్షర్ పటేల్, అర్ష్దీప్ చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశారు.


