News October 28, 2024
TGSP కానిస్టేబుల్స్ వంటమనుషులా?.. వాట్సాప్ మెసేజ్ VIRAL

TGSP కానిస్టేబుల్స్ను పైఅధికారులు వ్యక్తిగతంగా ఎలా వాడుకుంటున్నారో తెలిపేలా ఓ వాట్సాప్ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఒక IPS ఇంట్లో వంట పని చేసేందుకు కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ కావాలని, కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే వండాలని ఆ మెసేజ్లో ఉంది. కాగా TGSP కానిస్టేబుల్స్ పరిస్థితులు మరీ ఇంత దారుణమా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదేంటని అడిగితే డిస్మిస్ చేస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 22, 2025
ఆరావళి పర్వతాలపై కేంద్రం క్లారిటీ

ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న <<18631068>>ఆరోపణల<<>>పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరావళి పర్వతాల మైనింగ్పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.
News December 22, 2025
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ ఆత్మహత్య

హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. ‘It: Chapter Two’, ‘The Black Phone’ వంటి చిత్రాలతో పాటు పలు సిరీస్ల్లోనూ ఆయన నటించారు. ప్రముఖ టీవీ సిరీస్ ‘The Wire’లో జిగ్గీ సోబోట్కా పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో జన్మించిన రాన్సోన్ గత కొంతకాలంగా వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీటి గురించి ఆయనే స్వయంగా పలుమార్లు తెలిపారు.
News December 22, 2025
100% సబ్సిడీతో ఆయిల్పామ్ మొక్కలు

AP: ఆయిల్పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి మొక్కలకు ₹29 వేలు, స్వదేశీ మొక్కలకు ₹20 వేలు ఇస్తోంది. బోర్వెల్కు ₹25 వేలు, మోటారుకు ₹10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్ ఏర్పాటుకు ₹20 వేలు అందజేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2.49 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు.


