News September 8, 2025
బీసీలే టార్గెట్గా కవిత, మల్లన్న పార్టీలు?

TG: రాష్ట్రంలో BC కాన్సెప్ట్తో 2 కొత్త పార్టీలు ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల 17న పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి జెండా, ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత యోచిస్తున్నట్లు సమాచారం. బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి వీరిద్దరూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Similar News
News September 8, 2025
CM రేవంత్కు సుప్రీంకోర్టులో ఊరట

TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.
News September 8, 2025
ఈవారం ఓటీటీలోకి రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు

సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ ఈనెల 11న ఓటీటీలో(అమెజాన్ ప్రైమ్ వీడియో) విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా తెరకెక్కిన ‘సైయారా’ చిత్రం ఈనెల 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది.
News September 8, 2025
మహాలయ పక్షాలు అంటే ఏంటి?

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.