News March 5, 2025
సక్రమంలో అక్రమాలు?

తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేదలుంటున్న భూములపై నామినల్ ఫీజుతో వారికి హక్కు ఇచ్చే ఈ బాధ్యత సబ్ రిజిస్ట్రార్లపై ఉంది. కానీ కొందరు భారీ భూ కబ్జాదారులు తమ తరఫు వారితో ఇప్పటికే అప్లికేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటిని గుర్తించడంలో ప్రభుత్వ వర్గాలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భూ సంపద అన్యాక్రాంతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


