News January 1, 2025

ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఉంది వీరేనా?

image

సంక్రాంతి తర్వాత AP BJPకి ఆ పార్టీ అధిష్ఠానం కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. ప్రస్తుత చీఫ్ పురందీశ్వరికి కేంద్ర క్యాబినెట్‌లో పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఎవరికిస్తారనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యేలు డా.పివి.పార్థసారథి, సుజనా చౌదరి, మాజీ MLC పీవీఎన్ మాధవ్, సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News January 31, 2026

₹70,000 కోట్లకు చేరిన భారత స్పేస్ ఎకానమీ

image

భారత స్పేస్ ఎకానమీ ₹70,000Crకు చేరిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇస్రో ఇప్పటివరకు 434 ఫారిన్ శాటిలైట్లను లాంచ్ చేసిందని, వాటి ద్వారా ₹4,800Cr ఆర్జించినట్లు తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో ప్రైవేటు కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిందని, ప్రస్తుతం 399 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయన్నారు. రాబోయే 8-10 ఏళ్లలో ఈ రంగం 4-5 రెట్లు వృద్ధి చెంది ₹3.3-3.7లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు.

News January 31, 2026

కోడి పిల్లలకు ‘పుల్లోరం’తో ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.

News January 31, 2026

శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించాలి?

image

సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. నోటి నుంచి అసలు అసత్యాలే రాకూడదు. ఎవరి వద్ద నుంచి ఇనుము, ఉప్పు, నూనె వంటివి చేతితో తీసుకోకూడదు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, మూగజీవాలకు ఆహారం ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు పాటించాలి. ఇతరుల పట్ల దయతో మెలగడం శనిదేవునికి అత్యంత ప్రీతికరం.