News March 19, 2024
టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

AP: 11 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు TDP సిద్ధమైనట్లు సమాచారం. శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, విజయనగరం-అశోక్ గజపతిరాజు, విశాఖ-భరత్, విజయవాడ-కేశినేని చిన్ని, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం-JC పవన్, హిందూపురం-పార్థసారధి, నంద్యాల-బైరెడ్డి శబరి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News August 28, 2025
సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
News August 28, 2025
మెదక్, కామారెడ్డి జిల్లాలో రేపు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు మెదక్ జిల్లాలో సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇచ్చింది. అటు కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD HYD తెలిపింది. దీంతో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరి మీ ప్రాంతంలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.
News August 28, 2025
US సాఫ్ట్ డ్రింక్స్ బహిష్కరిద్దామంటూ నెట్టింట చర్చ

టారిఫ్స్ పెంచి భారత్ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.