News July 10, 2025
అప్పులపై ప్రశ్నిస్తే దేశద్రోహులమా?: బుగ్గన

AP: రాష్ట్రంలో రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశద్రోహులమా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? తల్లికి వందనం కొంతమందికే ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యాయి?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News July 11, 2025
కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <
News July 11, 2025
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
News July 10, 2025
అరుదైన రికార్డు సృష్టించిన రూట్

భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్(81*) అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 33 మ్యాచ్ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్ చేశారు.