News September 19, 2025

వరి చిరు పొట్ట దశలో పొటాష్ వేస్తున్నారా?

image

వరిసాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 24, 2026

పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

image

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.

News January 24, 2026

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

గువాహటిలోని <>కాటన్ <<>>యూనివర్సిటీ 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News January 24, 2026

రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేశారు!

image

70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిందీ ఘటన. హస్‌దేవ్ లెఫ్ట్ కెనాల్‌పై 40ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. దాని బరువు 10 టన్నులపైనే ఉంటుంది. 15మంది కలిసి బ్రిడ్జిని కట్ చేసి, తుక్కు కింద అమ్మారని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.