News April 13, 2025
సిగ్గుందా?.. యూసుఫ్ పఠాన్పై తీవ్ర విమర్శలు

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ముగ్గురు చనిపోయారు. మాజీ క్రికెటర్, TMC MP యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బహరంపూర్లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలాఉంటే యూసుఫ్ చాయ్ తాగుతూ ఓ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. ఏమాత్రమైనా సిగ్గుందా? అని దుయ్యబడుతున్నారు. హిందువులు ఊచకోతకు గురవుతుంటే పఠాన్ ఎంజాయ్ చేస్తున్నారని BJP నేత షెహజాద్ ఫైరయ్యారు.
Similar News
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్లైన్లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 17, 2025
ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్లైన్లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News November 17, 2025
పెరిగిన బంగారం ధరలు

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.


