News November 26, 2024
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. నిలబడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాలని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.
Similar News
News January 15, 2026
పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.
News January 15, 2026
అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్లింక్

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <
News January 15, 2026
మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.


