News November 26, 2024
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. నిలబడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాలని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.
Similar News
News October 21, 2025
శివ పూజ ఇలా చేస్తే.. అన్ని శుభాలే!

రోజుకు 3 సార్లు చేసే పూజలను త్రికాలార్చనలు అని అంటారు. వాటిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేస్తారు. ఉదయం చేసే పూజలు నిత్య కర్మలకు అనువైనవి. మధ్యాహ్నం చేసేవి కామ్య కర్మలకు (కోరికలు తీరడం కోసం) తగిన సమయం. సాయంత్ర పూజలు శాంతి కర్మలకు (దోషాలు తొలగిపోవడం కోసం) మంచివి. రాత్రి మధ్య భాగమైన నిశీధ సమయంలో చేసే శివపూజకు గొప్ప ఫలం ఉంటుంది. ఇలాంటి కర్మల ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని నమ్మకం. <<-se>>#SIVOHAM<<>>
News October 21, 2025
సలాం పోలీస్

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్ చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న పంజాబ్ DSP కరమ్ సింగ్ నేతృత్వంలోని CRPF బృందం గస్తీ కాస్తోంది. అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగింది. వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
News October 21, 2025
‘శుక్లాంబరధరం విష్ణుం’ అర్థమిదే..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే!!
తెల్లని వస్త్రాలను ధరించినట్టి, విష్ణువు వలె జగమెల్లను వ్యాపించినట్టి, చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతిని కలిగినట్టి, నాలుగు చేతులు కలిగినట్టి, శాంతిగల ముఖమును కలిగినట్టి గణపతిని సకల విఘ్నములను నివారించుటకై ధ్యానించవలెను.