News November 26, 2024
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?

నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. నిలబడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాలని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.
Similar News
News December 3, 2025
T20 వరల్డ్ కప్కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్పూర్లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.
News December 3, 2025
టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్నెట్ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.
టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్దీప్
News December 3, 2025
కాలి వేళ్ల వెంట్రుకలు రాలిపోతున్నాయా?

కాలి వేళ్లపై ఉండే వెంట్రుకలు శరీర రక్త ప్రసరణ, జీవక్రియ ఆరోగ్యాన్ని పరోక్షంగా సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘వేగంగా వెంట్రుకలు పెరిగితే రక్తప్రసరణ బాగుందని అర్థం. రక్త ప్రసరణ తగ్గినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. దీర్ఘకాలిక మధుమేహం లేదా PAD వంటి సమస్యల తొలిదశలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని వ్యాధి నిర్ధారణకు ముందు శారీరక సూచనగా పరిగణించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.


