News March 19, 2024

ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా.. కేంద్రం తీవ్ర హెచ్చరికలు!

image

ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్‌లో పలు రకాలైన లోపాలను గుర్తించామని CERT తెలిపింది. ‘లోపాల కారణంగా పరికరాలను ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. పని చేయకుండా చేసి అతి రహస్యమైన సమాచారాన్ని చోరీ చేయొచ్చు. 16.76 వెర్షన్ కంటే పూర్వపు వెర్షన్లు వాడుతున్నవారిని ఇది ప్రభావితం చేస్తుంది. ఆ ఓఎస్ వాడేవారు జాగ్రత్త’ అని సూచించింది.

Similar News

News July 8, 2024

కొడాలి నానికి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

News July 8, 2024

బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు

image

సందేశ్‌ఖాలీ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి చురకలంటించింది. ఆ ఘటనపై CBIతో దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ‘ఒక వ్యక్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అని ప్రశ్నించింది.

News July 8, 2024

పేటీఎం షేర్లలో 9% వృద్ధి!

image

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్‌లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్‌తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్‌కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.