News March 27, 2025
జియో, ఎయిర్టెల్, Vi సిమ్లు వాడుతున్నారా?

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల కోసం త్వరలో ‘కాలర్ నేమ్ ప్రజెంటేషన్’ సదుపాయాన్ని తీసుకురానున్నాయి. ఇది ఆయా యూజర్లకు కాల్ చేసిన అవతలి వ్యక్తి పేరును ఫోన్ స్క్రీన్పై చూపిస్తుంది. ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్ను అరికట్టేందుకు TRAI దీనిని గతంలోనే ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ ఫీచర్ను అమలు చేసేందుకు Jio, Airtel, Vodafone-Idea(Vi) సిద్ధమయ్యాయి. KYC డాక్యుమెంట్ ఆధారంగా ఈ పేర్లను చూపించనున్నాయి.
Similar News
News December 5, 2025
ఉప్పును నేరుగా చేతితో తీసుకోకూడదు.. ఎందుకు?

ఉప్పును నేరుగా చేతితో తీసుకోవడాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా చేయడాన్ని రహస్యాలు పంచుకోవడంలా భావిస్తారు. ఫలితంగా గొడవలు జరుగుతాయని, చేతితో ఉప్పు తీసుకున్నవారిపై శని ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. జ్యేష్టాదేవి దోషాలను తొలగించడానికి ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఇతరుల చేతి నుంచి ఉప్పు స్వీకరిస్తే, వారిలోని చెడు ప్రభావం మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తారు.
News December 5, 2025
అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్<<>>ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News December 5, 2025
అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.


