News February 10, 2025
వీరు త్వరగా ముసలోళ్లు కారు?

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.
Similar News
News November 13, 2025
వచ్చే ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేసి, డెయిరీ ఫామ్ను విస్తరించి వచ్చే ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
News November 13, 2025
మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?
News November 13, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?


