News March 8, 2025

ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్‌స్కీకి పెరిగిన ప్రజల మద్ధతు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 10 శాతం ప్రజా మద్ధతు పెరిగినట్లు KIIS రిపోర్టు తెలిపింది. ట్రంప్‌తో భేటీకి ముందు ఆయనకు 57 శాతం మద్ధతు ఉందని, ఇప్పుడు అది 67 శాతానికి పెరిగిందని పేర్కొంది. ట్రంప్ తమ దేశాధినేతను అవమానించినట్లు ఉక్రెయిన్ ప్రజలు భావించారని, అందుకే ఆయనకు మద్ధతుగా నిలిచారని వెల్లడించింది.

Similar News

News April 9, 2026

IMDb టాప్-5 బెస్ట్ IPL మ్యాచులివే..

image

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ IMDb.. IPLలో టాప్-5 మ్యాచుల జాబితాను విడుదల చేసింది.
టాప్-1: 2019 MI-CSK థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్‌
టాప్-2: 2023లో GTపై KKR ప్లేయర్ రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదిన గేమ్‌
టాప్-3: 2014లో RR విధించిన 190 రన్స్ టార్గె‌ట్‌ను MI 14.4 ఓవర్లలోనే ఛేదించిన మ్యాచ్‌
టాప్-4: 2017 ఫైనల్లో RPSపై ఒక్క రన్ తేడాతో గెలిచిన MI మ్యాచ్‌
టాప్-5: 2023 ఫైనల్లో GTపై CSK థ్రిల్లింగ్ విక్టరీ

News April 9, 2026

తక్కువే తిన్నా బరువు తగ్గట్లేదా?

image

తక్కువ తింటున్నా, వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గట్లేదని కొందరు బాధపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ వీటిపైనే ఆధారపడదని వైద్యులు చెబుతున్నారు. ‘ఎక్సర్ సైజ్ తర్వాత ఒకేచోట కదలకుండా ఉండటం కారణం కావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల అధిక క్యాలరీలు తీసుకోవడమూ మరో కారణం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా బరువు తగ్గడానికి అడ్డుపడుతుంది. కొన్ని వ్యాధులకు వాడే మందులూ శరీర కొవ్వు తగ్గడాన్ని ఆపుతాయి’ అని అంటున్నారు.

News April 9, 2026

ఈనెల 15 నుంచి అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్

image

అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. పహల్గామ్, బాల్తాల్ మార్గాలకు ఈ రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపింది. 13ఏళ్ల లోపు, 70ఏళ్లు పైబడిన వారికి అనుమతి లేదు. <>jksasb.nic.in<<>>లో ఆన్‌లైన్.. SBI, PNB, J&K, యస్ బ్యాంక్ బ్రాంచ్‌ల్లో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ₹220 ఫీజు చెల్లించి హెల్త్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ ఫొటో సబ్మిట్ చేయాలి.