News November 14, 2024

గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS

image

TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.

Similar News

News February 25, 2026

AC ధరలు హీటెక్కిస్తాయి!

image

ఈ వేసవిలో AC కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ తగ్గడంతో ACల రేట్లు 5 నుంచి 15% పెరుగుతాయని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ చెప్పారు. రాగి టన్నుకు 13 వేల డాలర్లు పలుకుతోంది. దీంతో పాటు కొత్త పవర్ సేవింగ్ రూల్స్ వల్ల ACల తయారీ ఖర్చు భారమైంది. ధరలు పెరిగినా ఈసారి అమ్మకాలు కూడా 20% పెరుగుతాయని ముకుందన్ తెలిపారు.

News February 25, 2026

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

image

తమిళనాడులోని శివగంగ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిషుడు రామకృష్ణన్‌కు 200 ఏళ్ల జైలు శిక్ష, ₹2L జరిమానా విధించింది. అలాగే బాధితులకు ₹10L చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 14, 17 ఏళ్ల కూతుళ్లు సరిగ్గా చదవడం లేదంటూ తల్లి వారిని 2021లో జ్యోతిషుడి దగ్గరికి తీసుకెళ్లింది. అతను పరిహారం పేరుతో బాలికలపై అఘాయిత్యం చేశాడు.

News February 25, 2026

PHOTO GALLERY: MLA, MLCల ‘ఆటవిడుపు’

image

AP: ఆటవిడుపులో భాగంగా 3 రోజులపాటు నిర్వహించే క్రీడా ఉత్సవాలు-2026లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందడి చేస్తున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందెం, వాలీబాల్, టెన్నికాయిట్ లాంటి పోటీల్లో తలపడ్డారు. 83 ఏళ్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, 79 ఏళ్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం వయసుతో సంబంధం లేకుండా సత్తా చాటారు.