News November 14, 2024

గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS

image

TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.

Similar News

News March 5, 2026

జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

image

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.

News March 5, 2026

హలీం అమ్మకాలు: ₹2వేల కోట్లకు పైగా వ్యాపారం!

image

TG: రంజాన్‌లో HYD సహ రాష్ట్రంలో పలు పట్టణాల్లో హలీం అమ్మకాలు అత్యధికంగా జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాలకూ ఎగుమతి అవుతుంటుంది. ఒక మోస్తరు రెస్టారెంట్లలో ప్లేట్ హలీంకు ₹320 కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. గత ఏడాది ₹1500CRకు పైగా విక్రయాలు జరిగాయి. GST 5% చెల్లించాల్సి ఉన్నా కట్టకపోవడంతో వాణిజ్యపన్నుల అధికారులు వ్యాపారులకు నోటీసులిచ్చారు. ఈ ఏడాది ₹2000CRకు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

News March 5, 2026

మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

image

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్‌లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.