News November 9, 2024

ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నా: MLA కైజర్

image

తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆర్మీ ఆఫీసర్ వేధింపులతో మిలిటెంట్ కావాలనుకున్నానని NC MLA కైజర్ జంషైద్ వెల్లడించారు. J&K అసెంబ్లీలో మాట్లాడుతూ ‘అప్పుడు నాతో సహా 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో చేరిన వ్యక్తి గురించి తెలియదనడంతో కొట్టారు. దీంతో తాను మిలిటెంట్ అవ్వాలనుకుంటున్నానని సీనియర్ ఆఫీసర్‌తో చెప్పా. ఆయన తన సహోద్యోగిని మందలించడంతో వ్యవస్థపై నమ్మకం వచ్చింది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శనివారం 10 గంటలకు పీజీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

News December 26, 2025

మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

image

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.

News December 26, 2025

రెండు కేటగిరీల్లో నోబెల్.. రేడియేషన్‌తో మృతి

image

రెండు సైంటిఫిక్ కేటగిరీల(ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911))లో నోబెల్ సాధించిన ఒకేఒక్కరు మేరీ క్యూరీ. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి 127ఏళ్ల క్రితం ఇదే రోజు రేడియం, పొలోనియం కనుగొన్నారు. ఒట్టి చేతులతో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్‌ పట్టుకోవడంతో వారు ఉపయోగించిన వస్తువులకూ వ్యాపించాయి. రేడియేషన్ కారణంగా బోన్ మేరో బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయలేకపోవడంతో అప్లాస్టిక్ అనీమియా వచ్చి మేరీ 1934లో మరణించారు.