News January 4, 2025

లోయలో పడిన ఆర్మీ ట్రక్.. నలుగురు జవాన్లు మృతి

image

J&Kలోని బందిపూర్ జిల్లాలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు జవాన్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్ 24న కూడా ఓ ఆర్మీ వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News October 27, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.

News October 27, 2025

బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే..

image

క్రికెటర్లు మైదానంలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు చెమట రూపంలోనే బయటకు వెళ్తుంది. ఒకవేళ బ్యాటింగ్ చేస్తుండగా యూరిన్ వస్తే ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లో వెళ్లి రావచ్చు. మరీ అర్జెంట్ అయితే అంపైర్ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఫీల్డర్లకు టాయిలెట్ వస్తే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడు కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.

News October 27, 2025

పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని.. రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.